1. ఈ క్రింది వాటిని పరిశీలింపుము ప్రతిపాదన
( A ) : భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలతో పోలిస్తే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది . కారణము
( R ) : నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో పోలిస్తే విస్తృతి గల అరేబియా సముద్రం మీదుగా కదులుతాయి .
A ) ( A ) మరియు ( R ) నిజమైనవి . ( A ) కి ( R ) సరైన వివరణ
B ) ( A ) మరియు ( R ) నిజమైనవి . ( A ) కి ( R ) సరైన వివరణ కాదు
C ) ( A ) నిజమైనది ( R ) నిజమైనది కాదు
D ) ( A ) నిజమైనది కాదు ( R ) నిజమైనది
2. భారతదేశంలో దుర్భిక్షాలు మరియు వరదలు ఒక సాధారణ వాతావరణ ప్రక్రియలా ఉన్నాయి . కారణం :
A ) దేశ భూభాగంలో సంవత్సరానికి , సంవత్సరానికి మధ్య ఋతుపవనాల విచలనము ఎక్కువగా ఉండటం వలన
B ) దేశంలో ఋతుపవనాల కాల నిడివి తక్కువగా ఉన్నందున
C ) దేశ భూ భాగంలో ఎక్కువ విస్తృతి కలిగి ఉన్నందున
D ) దేశంలో వర్షచ్చాయ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున
3. దుర్భిక్ష ప్రాంతాలలో వర్షపాత విచలనము ( rainfall variability ) ఎంతవరకు ఉంటుంది ?
A ) 20 - 25 శాతం
B ) 30 శాతం కన్నా ఎక్కువ
C ) 15 శాతం కన్నా తక్కువ
D ) 15 - 20 శాతం
4. గంగా మైదాన ప్రాంతంలో వర్షపాత విస్తరణ రీతిని ఏవిధంగా పేర్కొనవచ్చు ?
A ) తూర్పు నుండి పశ్చిమానికి వర్షపాత పరిమాణం తగ్గుతుంది
B ) పశ్చిమం నుండి తూర్పుకు వర్షపాత పరిమాణం తగ్గుతుంది
C ) తూర్పు నుండి పశ్చిమానికి వర్షపాత పరిమాణం పెరుగుతుంది
D ) ఉత్తరం నుండి దక్షిణానికి వర్షపాత పరిమాణం తగ్గుతుంది
5. ఈ క్రింది వాటిని పరిశీలింపుము . ప్రతిపాదన
( A ) : జూన్ మొదటివారంలో దేశ భూ భాగంలో వాతావరణంలో తేమశాతం పెరిగి , ఉష్ణోగ్రతల 7 - 8 ° C తగ్గి అక్కడక్కడ ఉరుములు , మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది . కారణం
( R ) : జూన్ మొదటివారంలో నైరుతి ఋతుపవనాలు క్రమక్రమంగా కాకుండా , ఆకస్మికంగా కేరళలోకి ప్రవేశిస్తాయి .
A ) ( A ) మరియు ( R ) నిజమైనవి . ( A ) కి ( R ) సరైన వివరణ
B ) ( A ) మరియు ( R ) నిజమైనవి . కాని ( A ) కి ( R ) సరైన వివరణ కాదు
C ) ( A ) నిజమైనది ( R ) నిజమైనది కాదు
D ) ( A ) నిజమైనది కాదు ( R ) నిజమైనది
6. వేసవి ఋతుపవనాల వలన ఏ ప్రాంతంలో మొదటి వర్షపాతం సంభవిస్తుంది ?
A ) పశ్చిమ కనుమలు
B ) హిమాలయాలు
C ) తూర్పు కనుమలు
D ) గంగా - సింధు మైదానాలు
7. రాజస్థాన్ లో ఋతుపవనాల వలన తక్కువ వర్షపాతం కాలగటానికి గల కారణం ఏమి ?
A ) ఆరావళి పర్వతాలు ఋతుపవనాలు కదిలే దిశకు సమాంతరంగా ఉన్నందున
B ) ఋతుపవనాలు రాజస్థాన్ భూ భాగం చేరే సమయానికి అందులో తేమశాతం తగ్గిపోవడం
C ) హిమాలయాలు రాజస్తాన్ భూ భాగానికి దూరంగా ఉండటం
D ) పైవన్నీ
8. భారత దేశ వ్యవసాయ రంగాన్ని ఋతుపవనాలతో “ జూదం ఆడటం లాంటిది " గా పేర్కొనడానికి కారణం ?
A ) ఋతుపవన కాలంలో అధిక వర్షపాతం సంభవించడం వలన
B ) ఋతుపవనాల అనిశ్చితత్వం వలన
C ) పశ్చిమ కనుమల ప్రాంతాల్లో అధిక వర్షపాతం వలన
D ) దేశ వాయువ్య ప్రాంతము మరియు తమిళనాడు భూ భాగంలో సంభవించే శీతాకాల వర్షాల వలన
9. క్రింది వాటిలో నిజమైన వాక్యాన్ని పరిశీలింపుము.
A ) రాజస్థాన్ లోని పశ్చిమ భూ భాగం నుంచి సముద్ర జలరాసులు తిరోగమనం చెందటం మరియు శీతోష్ణ స్థితిలో మార్పుల కారణంగా ఏడారీకరణ విస్తరించింది.
B ) తూర్పు కనుమలతో పోలిస్తే , పశ్చిమ కనుమల ప్రాంతం తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది
C ) ఆరావళి పర్వత పరిసరాల్లో ఎక్కువ వర్షపాతం సంభవించడానికి ఆరావళి పర్వతాలు కారణంగా ఉన్నాయి .
D ) దేశ ఈశాన్య ప్రాంతం తిరోగమన నైరుతి ఋతుపవనాల వలన ఎక్కువ వర్షపాతాన్ని పొందుతుంది .
10. బ్రహ్మపుత్ర నదీలోయ శీతోష్ణస్థితికి సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము .
1 ) ఈ ప్రాంతంలో సంభవించే వర్షపాతం పర్వతీయ రకానికి చెందినది
2 ) ఋతువును అనుసరించి పీడనా వ్యవస్థలో మార్పులు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయి .
3 ) పర్వత మరియు లోయ పవనాల ప్రభావం ఎక్కువ ఉంటుంది .
4 ) వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది .
A ) 1 మరియు 2
B ) 2 మరియు 3
C ) 1 , 2 మరియు 3
D ) 1.3 మరియు 4
11. నైరుతి ఋతుపవన కాలంలో తమిళనాడు పొడిగా ఉండటానికి కారణం ..
A ) పశ్చిమ కనుమల పర్వత పరా పరాన్ముఖ దిశలో ఉండటం
B ) ఋతుపవన గాలులు తమిళనాడు భూ భాగం చేరే సమయానికి అవి పొడిగా మారడం
C ) బంగాళాఖాత ఋతుపవన గాలులు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదలడం
D ) పైవన్నీ
12. అక్టోబర్ హీట్ కి కారణం ?
A ) బెంగాల్ మైదాన ప్రాంతాల్లో వాతావరణంలో అధిక ఆమ్రత ఉండటం
B ) పొడి , వేడి వాతావరణం ఉండటం
C ) పవనాల వేగం తక్కువగా ఉండటం
D ) గంగా - సింధూ మైదానాల్లోని అల్ప పీడన వ్యవస్థలు
13. దేశంలో నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనకాల ద్వారా వర్షాన్ని పొందే ప్రాంతం ?
A ) నర్మదా నదిలోయ ప్రాంతం
B ) కావేరీ నదిలోయ ప్రాంతం
C ) కోరమండల్ తీరం
D ) యమునా నదిలోయ ప్రాంతం
14. భారతదేశంలో పశ్చిమ అలజడుల వల్ల తగినంత స్థాయిలో వర్షపాతం పొందే ప్రాంతం
A ) సట్లెజ్ - యమునా మైదానం
B ) చంబర్ - యమునా మైదానం
C ) పశ్చిమ రాజస్థాన్
D ) కాశ్మీర్ లోయ
15. భారతదేశంలో శీతోష్ణస్థితికి సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము .
1. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటగానే 180 ° కోణంతో అపవర్తనం చెంది దేశ భూభాగంలోకి ప్రవేశిస్తాయి .
2. నైరుతి ఋతుపవనాలు పొడి పవనాలు కాగా , ఈశాన్య ఋతుపవనాలు తడిపవనాలు
3. ఈశాన్య వ్యాపార పవనాలే నైరుతి ఋతుపవనాలుగా మారుతాయి .
4. ఆగ్నేయ వ్యాపార పవనాలే నైరుతి ఋతుపవనాలుగా మారుతాయి .
A ) 2 మరియు 3
B ) 1 మరియు 3
C ) 1 మరియు 4
D ) 2 మరియు 4
ANSWERS
1 A 2 A 3 B 4 A 5 A 6 D 7 A 8 B
9 A 10 C 11 B 12 A 13 B 14 A C 15